చేతులు కలిపిన నేతలు .. పరస్పర సహకారంతో ముందుకేళ్లాలని నిర్ణయం

చేతులు కలిపిన నేతలు .. పరస్పర సహకారంతో ముందుకేళ్లాలని నిర్ణయం
  • ఎల్లారెడ్డి కాంగ్రెస్​ క్యాండిడేట్​మదన్​కు బాసటగా నిలుస్తున్న ఏనుగు అనుచరులు
  • బాన్సువాడలో ఏనుగు విజయానికి కృషి చేస్తామంటున్న మదన్​మోహన్, ఆయన వర్గం​
  • రెండు నియోజకవర్గాల్లో తమ క్యాడర్​ను యాక్టివ్​ చేసిన నేతలు

కామారెడ్డి, వెలుగు: మొన్నటి వరకు ఒకే నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే పార్టీ నుంచి చెరో చోట పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఒకరికి టికెట్​కన్ఫామ్​కాగా, మరో నేతకు అఫిషీయల్​గా ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు ‘చేతులు’ కలిపి పరస్పరం సహకరించుకునేందుకు సిద్ధమయ్యారు. వారే ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్​మోహన్​రావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు తమ క్యాడర్​ను రెండు నియోజకవర్గాల్లో యాక్టివ్​ చేశారు.

గతంలో జహీరాబాద్​ ఎంపీగా రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన మదన్​మోహన్​రావుకు ఆయా నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్​ ఉంది. 2019 పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్ఎస్ ​అభ్యర్థి బీబీపాటిల్​కు గట్టి పోటీ ఇచ్చి, స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత  కొన్నాళ్లకు ఎల్లారెడ్డి నియోజకవర్గంపై స్పెషల్​ ఫోకస్ ​పెట్టారు. పార్టీ ప్రోగ్రామ్స్​తో పాటు, వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎల్లారెడ్డికి పక్కనే ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలోనూ మదన్​కు క్యాడర్​ఉంది.

ఎల్లారెడ్డి కాంగ్రెస్​టికెట్​కోసం మదన్​మోహన్​రావు, సుభాష్​రెడ్డి పోటీపడగా అధిష్టానం మదన్​కు టికెట్​ఇచ్చింది. ఏనుగు రవీందర్​రెడ్డి బీఆర్ఎస్​ నుంచి ఎల్లారెడ్డిలో పోటీ వరుస విజయాలు సాధించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి జాజాల సురేందర్​చేతిలో ఓడిపోయారు. కొన్నాళ్లకు సురేందర్​కాంగ్రెస్​లో చేరాడు. ఎమ్మెల్యే సురేందర్​తో పొసగక కొన్నాళ్లకు ఏనుగు బీజేపీలో చేరారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో రవీందర్​రెడ్డి ఇటీవల కాంగ్రెస్​తీర్థం పుచ్చుకున్నారు. ఎల్లారెడ్డిలో అప్పటికే ఇద్దరు నేతలు టికెట్​రేసులో ఉన్న దృష్ట్యా ఈయన్ను పక్క నియోజకవర్గం బాన్సువాడలో పోటీ చేయాలని అధిష్టానం సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నేతల మధ్య అవగాహన..

ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డికి క్యాడర్​ఉంది. ఈయన కాంగ్రెస్​లో చేరిన దృష్ట్యా వారు కూడా ఈ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. బాన్సువాడలో మదన్​మోహన్​రావుకు క్యాడర్​ఉంది. బాన్సువాడ నుంచి పోటీకి ఏనుగు రవీందర్​రెడ్డి రెడీ అయ్యారు. అధిష్టానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మదన్​మోహన్​రావు, ఏనుగు రవీందర్​రెడ్డిల మధ్య అవగాహన కుదిరింది.

ALSO READ : నన్ను కొనే శక్తి ఎవరికీ లేదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఏనుగు రవీందర్​రెడ్డి క్యాడర్​ఎల్లారెడ్డిలో మదన్​ మోహన్​రావుకు పని చేయనుండగా, మదన్​మోహన్​క్యాడర్​బాన్సువాడలో రవీందర్​రెడ్డికి పనిచేసేలా అవగాహన కుదిరినట్లు పార్టీ లీడర్లు చెబుతున్నారు. సదాశివ్​నగర్, ఎల్లారెడ్డిల్లో  శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లోనూ ఏనుగు రవీందర్​రెడ్డితో పాటు, ఆయన క్యాడర్​హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రెండు చోట్ల తమ క్యాడర్​ని యాక్టివ్​చేసి పరస్పర విజయం కోసం సహకరించుకుంటున్నారు.