- లెవలింగ్ పనులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత భూమి పూజ
గోదావరిఖని, వెలుగు : తెలంగాణ ప్లాంట్స్టేజ్2 నిర్మాణ పనులను ఎన్టీపీసీ విద్యుత్సంస్థ శనివారం ప్రారంభించింది. మెయిన్ప్లాంట్సైట్లెవలింగ్పనులకు రామగుండం, తెలంగాణ ప్లాంట్హెడ్, ఎగ్జిక్యూటివ్డైరెక్టర్చందన్కుమార్ సమంత భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ, బీహెచ్ ఈఎల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. తెలంగాణ ప్లాంట్ స్టేజ్2లో ఒక్కో యూనిట్ 800 మెగావాట్లతో మూడు యూనిట్లకు సంబంధించిన బాయిలర్, టర్బైన్, జనరేటర్ (బీటీజీ) ఏర్పాటు పనులను బీహెచ్ఈఎల్దక్కించుకుంది.
మొత్తం రూ.13,500 కోట్లతో చేపడుతున్న ఈ పనులను 300 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్పునర్విభజన చట్టం 2014 ప్రకారం రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ ప్లాంట్స్టేజ్ 1 కింద ఇప్పటికే 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లలో రెండేండ్లుగా విద్యుత్ఉత్పత్తి జరుగుతోంది. రామగుండం ప్లాంట్లో ఇప్పటికే ఏడు యూనిట్ల ద్వారా 2,600 మెగావాట్ల విద్యుత్, తెలంగాణ స్టేజ్1 ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్, రిజర్వాయర్పై 100 మెగావాట్ల ప్లోటింగ్సోలార్విద్యుత్, సర్ఫేస్ పై 10 మెగావాట్ల సోలార్విద్యుత్కలిపి మొత్తం 4,300 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. తెలంగాణ ప్లాంట్ స్టేజ్2 నిర్మాణం సైతం పూర్తయితే మరో 2,400 మెగావాట్ల విద్యుత్ కలిపి రామగుండం ఎన్టీపీసీ ద్వారా మొత్తం 6,710 మెగావాట్ల విద్యుత్ఉత్పత్తి జరగనుంది. ఈ మొత్తం ఉత్పత్తి ప్రారంభం అయితే దేశంలోనే అత్యధిక విద్యుత్ఉత్పత్తి చేసే ప్లాంట్గా రామగుండం ఎన్ టీపీసీ నిలవనుంది.
