రూ. 12 వేల కోట్లు సేకరించనున్న ఎన్​టీపీసీ 

రూ. 12 వేల కోట్లు సేకరించనున్న ఎన్​టీపీసీ 

న్యూఢిల్లీ: బాండ్లు, ఎన్​సీడీల ద్వారా రూ.12 వేల కోట్లు సేకరించడానికి తమ బోర్డు ఆమోదం తెలిపిందని ఎన్​టీపీసీ తెలిపింది. పన్ను విధించదగిన/పన్ను రహిత, సంచిత/సంచితం కాని, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా ఈ డబ్బును సమకూర్చుకుంటామని తెలిపింది.   ప్రైవేట్​ప్లేస్​మెంట్​ పద్ధతిని అనుసరిస్తామని వెల్లడించింది. వచ్చే ఏజీఎంలోపు నిధుల సమీకరణ పూర్తవుతుందని ఎన్​టీపీసీ తెలిపింది.