భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మైనింగ్ లిమిటెడ్ (ఎన్ఎంఎల్) ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కోల్ మైనింగ్ ప్రాజెక్ట్/ ఆఫీసుల్లో పనిచేయడానికి ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 15.
- పోస్టుల సంఖ్య: 21.
- పోస్టులు: ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్), ఎగ్జిక్యూటివ్ (ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్) 03, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ 15.
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీ నుంచి డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఎస్సీ, ఎంటెక్, సీఏ/ సీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
- జీతం: రూ.60 వేల నుంచి 71 వేలు
- వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 నుంచి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 27.
- లాస్ట్ డేట్: నవంబర్ 15.
- పూర్తి వివరాలకు nml.co.in
- వెబ్సైట్లో సంప్రదించగలరు.
