రూ.4 వేల కోట్లు సేకరించనున్న ఎన్​టీపీసీ

రూ.4 వేల కోట్లు సేకరించనున్న ఎన్​టీపీసీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన కరెంటు తయారీ కంపెనీ ఎన్​టీపీసీ ప్రైవేట్ ప్లేస్‌‌‌‌మెంట్ ప్రాతిపదికన నాన్- కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ.నాలుగు వేల కోట్లు సేకరించాలని నిర్ణయించినట్లు బుధవారం తెలిపింది.  

ఈ ఆదాయాన్ని మూలధన వ్యయానికి నిధులు సమకూర్చడం, ప్రస్తుత అప్పుల రీఫైనాన్సింగ్,  ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఎన్​సీడీలకు సంవత్సరానికి 6.84 శాతం కూపన్ రేటు చెల్లిస్తారు. ఇవి పదేళ్లకు మెచ్యూర్​ అవుతాయి. ఈ డిబెంచర్లు బీఎస్​ఈలో లిస్ట్ అవుతాయి.