
నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ మంగళవారం మహిళా సందర్శకులతో కిటకిటలాడింది. విమెన్స్ స్పెషల్ డే కావడంతో సిటీలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు తరలివచ్చారు. ప్రతి ఏటా నుమాయిష్ ఎగ్జిబిషన్లో మహిళల కోసం ఒక రోజును స్పెషల్గా కేటాయిస్తారు. ఈసారి మంగళవారం స్పెషల్ డేగా కేటాయించడంతో మహిళలను, పిల్లలను మాత్రమే లోపలికి అనుమతించారు. జువెలరీ, ఫ్యాషన్ డ్రెస్సెస్, కశ్మీరి, లక్నో చికార్ ఆర్ట్ చీరల స్టాల్స్ వద్ద మహిళల సందడి కనిపించింది.
– వెలుగు, హైదరాబాద్