దేశంలో పెరిగిన బిలియనీర్లు 

దేశంలో పెరిగిన బిలియనీర్లు 
  • 2022 లో 161 చేరిన సంఖ్య..2027 నాటికి 195 కి  చేరుతారని అంచనా 
  • 7,97,714 కి పెరిగిన హై నెట్‌‌‌‌ వర్త్​ ఇండివిడ్యువల్స్‌‌‌‌
  • నైట్​ఫ్రాంక్​ రీసెర్చ్​రిపోర్టు వెల్లడి

బిజినెస్​ డెస్క్, వెలుగు​: దేశంలో  బిలియనీర్ల సంఖ్య కిందటేడాది బాగా పెరిగింది. 2021 లో వీరి సంఖ్య 145 గా ఉండగా, 2022 లో ఇది 161 పెరగడం విశేషం.  2027 నాటికి దేశంలో బిలియనీర్లు 195 కి పెరుగుతారని నైట్​ఫ్రాంక్ రిపోర్ట్‌‌‌‌ ​అంచనా వేస్తోంది. ఈ సంస్థ​ బుధవారం నాడు ది వెల్త్​ 2023 పేరుతో ఒక రిపోర్టును రిలీజ్​ చేసింది. మరోవైపు అల్ట్రా హైనెట్​వర్త్​ ఇండివడ్యువల్స్ (యూహెచ్‌‌‌‌ఎన్‌‌‌‌ఐ) సంఖ్య 2022 లో 7.5 శాతం తగ్గి 12,069 కి చేరిందని తెలిపింది. ఇండియాలో 30 మిలియన్​ డాలర్ల నుంచి బిలియన్ డాలర్ల మధ్య సంపద కలిగిన అల్ట్రా హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​ సంఖ్య రాబోయే 5 ఏళ్లలో 58.4 శాతం గ్రోత్​తో 2027 నాటికి 19,119 కి చేరుతుందని నైట్​ఫ్రాంక్​ రిపోర్టు చెబుతోంది.

ఒక మిలియన్​ డాలర్‌‌‌‌‌‌‌‌ నుంచి 30 మిలియన్ డాలర్ల మధ్య సంపద ఉన్న హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్ (హెచ్​ఎన్​ఐ)ల సంఖ్య 2022 లో 7,97,714 కి పెరిగింది. అంతకు ముందు ఏడాది వీరి సంఖ్య 7,63,674 మాత్రమే. 2027 నాటికి ఇండియాలోని హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​ సంఖ్య నైట్​ఫ్రాంక్​ అంచనా ప్రకారం 16,57,272 కి పెరగనుంది. దేశంలో వడ్డీ రేట్లు పెరగడంతోపాటు, అమెరికన్​ డాలర్​ బలపడటం వల్ల దేశంలోని యూహెచ్​ఎన్​ఐల సంపద తగ్గిపోయిందని రిపోర్టు వివరించింది. మరోవైపు హెచ్​ఎన్​ఐల సంఖ్య, బిలియనీర్ల సంఖ్య మాత్రం ఇండియాలో పెరిగింది. 2022 లో హెచ్​ఎన్​ఐల సంఖ్య 4.5 శాతం పెరగ్గా, బిలియనీర్ల సంఖ్య 11 శాతం ఎక్కువైంది.

గ్లోబల్​గానూ యూహెచ్​ఎన్​ఐలు తగ్గారు...

గ్లోబల్​గా చూసినా యూహెచ్ఎన్ఐల సంఖ్య 2022 లో తగ్గింది. 2021 లో 9.3 శాతం పెరిగిన యూహెచ్​ఎన్​ఐల సంఖ్య ఆ తర్వాత ఏడాది 2022 లో మాత్రం 3.8 శాతం తగ్గిపోయింది. ఎకనమిక్​ స్లోడౌన్స్​, రేట్ల పెరుగుదల, జియో-పొలిటికల్​ అనిశ్చితుల ఎఫెక్ట్​ పడటంతో  ఈ యూహెచ్​ఎన్​ఐల వెల్త్​-ఇన్వెస్ట్​మెంట్​ పోర్ట్​ ఫోలియోల విలువ తగ్గిపోయినట్లు నైట్​ఫ్రాంక్​ తన రిపోర్టులో పేర్కొంది. దేశంలో కోర్​, నాన్​–కోర్​ సెక్టార్లలో  డెవలప్​మెంట్​ యాక్టివిటీస్​ చురుగ్గా సాగుతుం డటంతో ఎకనమిక్​ గ్రోత్ ఇటీవల ఊపందుకుంది. అంతేకాదు, దీంతోపాటే గ్లోబల్​స్టార్టప్​ హబ్​గా తన పొజిషన్​నూ ఇండియా బాగా మెరుగు పరుచుకుంది.  స్టార్టప్​ల జోరుతో   కొత్త సంపద క్రియేట్​ అవుతోంది.
–శిశిర్​ బైజాల్​, చైర్మన్​, నైట్​ఫ్రాంక్​ ఇండియా