తాళ్ల గూడెంలో నర్సరీ దగ్ధం

తాళ్ల గూడెంలో నర్సరీ దగ్ధం

కామేపల్లి,వెలుగు :  మండలంలోని తాళ్ల గూడెంలోని నర్సరీ గురువారం దగ్ధమైంది. నర్సరీ సమీపంలో  కొందరు రైతులు తమపంట పొలాల్లోని  చెత్తకు నిప్పు పెట్టగా ప్రమాదవశాత్తు నర్సిరీకి మంటలు అంటుకున్నాయి.

దీంతో నర్సరీతోపాటు అందులోవాడే ట్రేలు, కొబ్బరి బిట్టు, నెట్టు కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు.