
న్యూఢిల్లీ: నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) రాబోయే 4-–5 సంవత్సరాల్లో ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. సంస్థకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఎండీ ఎం ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ 2023లో ఆదాయం 15 శాతం పెరిగి రూ. 1,100 కోట్లకు ఎగిసిందని అన్నారు.
సంఘటిత విత్తన మార్కెట్లో ఎన్ఎస్ఎల్కు భారీ వాటా ఉంది. మా ఆదాయంలో పత్తి విత్తనాల వాటా 45 శాతం ఉంటుంది. ఈ సెగ్మెంట్లో మాకు 16–-17 శాతం మార్కెట్ వాటా ఉంది. పొద్దుతిరుగుడు, ఆవాలు వంటి నూనె గింజలపై పరిశోధనలు చేస్తున్నాం. త్వరలో జనపనార విత్తనాలను కూడా అభివృద్ధి చేస్తాం’’ అని ఆయన తెలిపారు.