యాదాద్రిపై కాషాయ జెండా ఎగురేద్దాం..ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​

యాదాద్రిపై కాషాయ జెండా ఎగురేద్దాం..ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​

యాదాద్రి, వెలుగు : వచ్చే ఎన్నికల్లో ఆలేరు, భువనగిరిలో గెలిచి యాదాద్రి జిల్లాపై కాషాయ జెండా ఎగురవేద్దామని బీజేపీ స్టేట్​వైస్​  ప్రెసిడెంట్​ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన  భువనగిరిలో జరిగిన పార్టీ అనుబంధ మోర్చాల మీటింగ్​లో ఆయన మాట్లాడారు. కేసీఆర్​ గవర్నమెంట్​పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రజలను కలుసుకొని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించారు. 

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించాలన్నారు. బీజేపీ లీడర్​ దంతూరి సత్తయ్య అధ్యక్షతన జరిగిన మీటింగ్​లో నాయకులు గూడూరు నారాయణరెడ్డి, పాశం భాస్కర్, లింగస్వామి, ఉమాశంకర్​రావు, నర్ల నర్సింగ్ రావు,  మాయ దశరథ, పడమటి జగన్మోహన్​ రెడ్డి, సుర్వి లావణ్య, రాజశేఖర్ రెడ్డి, నరేశ్​నాయక్, మహమూద్, జనగాం కవిత, రత్నాపురం బలరాం ఉన్నారు.