
హైదరాబాద్, వెలుగు : టైర్–2 సిటీల్లో తమ హాస్పిటల్ నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తున్నామని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ కో–ఫౌండర్ డాక్టర్ దుర్గా రావు చెప్పారు. హనుమకొండలో కేంద్రంను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ఇది దేశంలో 33వ సెంటర్ అని చెప్పారు. తెలంగాణలో తమకు 33 ఆస్పత్రులు ఉన్నాయని తెలిపారు. టైర్–3 సిటీల్లోనూ ఆస్పత్రులను అందుబాటులోకి తెస్తామని రావు వివరించారు.