- సైన్స్ పరీక్షలకు 15 నిమిషాలు ముందు పార్ట్-బీ పేపర్
- ఇంగ్లిష్కు మాత్రం పార్ట్-ఏతో పాటే పార్ట్-బీ
- డీఈవోలకు ఉన్నతాధికారుల ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది టెన్ట్ పరీక్షల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించగా, ఈసారి నుంచి 6 పేపర్లతో నిర్వహిస్తున్నారు. అలాగే, పార్ట్--–బీ (ఆబ్జెక్టివ్ టైప్) ప్రశ్నపత్రం ఇచ్చే సమయాన్నీ మార్చారు. దీనిపై ఉన్నతాధికారులు డీఈవోలకు స్పష్టత ఇచ్చారు. మారిన విధానం ప్రకారం.. ఫస్ట్ లాంగ్వేజీ, సెకండ్ లాంగ్వేజీ (హిందీ), మ్యాథ్స్, సోషల్ సబ్జెక్టులకు చివరి అరగంట అంటే.. మధ్యాహ్నం12 గంటలకు పార్ట్–-బీ క్వశ్చన్ పేపర్ ఇవ్వనున్నారు. థర్డ్ లాంగ్వేజీ (ఇంగ్లిష్) పేపర్లు పార్ట్-–ఏ, పార్ట్--–బీ రెండూ ఒకేసారి ఎగ్జామ్ ప్రారంభం కాగానే ఉదయం 9.30 గంటలకే ఇస్తారు.
అయితే, సైన్స్లో మాత్రం ఫిజిక్స్, బయోలజీ సబ్జెక్టులకు వేర్వేరు క్వశ్చన్ పేపర్లుంటాయి. ఒక్కో పేపర్కు గంటన్నర టైమ్ ఇచ్చారు. ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఫిజిక్స్ ఎగ్జామ్ జరుగుతుంది. చివరి 15 నిమిషాల ముందు అంటే 10.45 గంటలకు పార్ట్-–బీ అందివ్వనున్నారు. 11 గంటలకు ఫిజిక్స్ ఆన్సర్ షీట్లు తీసుకున్నాక.. బయోలజీ క్వశ్చన్ పేపర్ ఇచ్చేందుకు 20 నిమిషాలు అడిషనల్గా కేటాయించారు. నిర్ణీత టైమ్ మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉండగా, చివరి 15 నిమిషాల ముందు 12.35 నిమిషాలకు పార్ట్--–బీ అందించనున్నారు.
సీసీ కెమెరాల ముందే ప్రశ్న పత్రాల ఓపెన్
టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ లీకేజీ ఘటనతో టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్పై సర్కారు అప్రమత్తమైంది. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. నిబంధనలు పటిష్టంగా అమలు చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. క్వశ్చన్ పేపర్లలో మార్పుల నేపథ్యంలో టీచర్లు, అధికారులను అలర్ట్ చేస్తోంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితారెడ్డి, సీఎస్ శాంతికుమారి.. కలెక్టర్లు, ఎస్పీలు, డీఈవోలతో పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు.
క్వశ్చన్ పేపర్ల ప్యాకెట్లను చీఫ్ సూపరింటెండెంట్ రూంలో నిర్ణీత టైమ్కు 15 నిమిషాల ముందే ఓపెన్ చేయాలని, దీనిపై ఇద్దరు ఇన్విజిలేటర్లు, సీఎస్, డీవో సంతకాలు చేయాలని ఆదేశాలిచ్చారు. పార్ట్–బీ పేపర్ కూడా స్టూడెంట్లకు ఇచ్చే పది నిమిషాల ముందే ఓపెన్ చేయాలి.. ఇదంతా కూడా సీసీ కెమెరాల ముం దే జరిగేలా చూడాలని ఉత్తర్వులిచ్చారు.
క్వశ్చన్ పేపర్పై హాల్ టికెట్ నంబర్ క్వశ్చన్ పేపర్స్లోని ప్రతి పేజీపై స్టూడెంట్ హాల్ టికెట్ నంబర్ వేయించాలని ఉన్నతాధికారులు సూచించారు. దీనిద్వారా క్వశ్చన్ పేపర్ బయటకు పోతే.. ఎవరి ద్వారా పోయిందో గుర్తించవచ్చని అధికారులు చెప్తున్నారు. హాల్ టికెట్ నంబర్ ఇతర ఎక్కడా వేయొద్దని ఆదేశాలిచ్చారు. స్టూడెంట్స్తో పాటు సిబ్బంది కూడా సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లొద్దని
ఆదేశాలు జారీ చేశారు.
హాజరుకానున్న 4,94,620 మంది స్టూడెంట్స్
రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్లకు మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం12.50 వరకు జరగనున్నాయి.స్టేట్ వైడ్గా 4,94,620 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్కు అటెండ్ అవుతుండగా.. వారికోసం 2,652 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.
