చౌటుప్పల్, వెలుగు: చౌటుప్పల్ మండలం లోని విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు,రెస్టారెంట్లపై మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశా రు. పరిసరాలు, ఆహార పదార్థాలు, కిచెన్ రూమ్ పరిశీలించి శాంపిల్స్ ను సేకరించారు.
ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి మాట్లాడుతూ శాంపిల్స్ ను హైదరాబాద్ టెస్టింగ్ ల్యాబ్ కు పంపించామని, రిపోర్ట్స్ లో కల్తీ అని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారి డాక్టర్ సుమన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.