ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ డేట్ ఫిక్స్.. స్టేడియం అదే!

ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ డేట్ ఫిక్స్.. స్టేడియం అదే!

ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఆక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ షెడ్యూల్‍ను ఐసీసీ త్వరలోనే విడుదల చేయనుంది. అయితే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి డ్రాప్ట్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి పంపినట్లు ప్రముఖ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ ఈఎస్‌పీఎన్ వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్లు తెలుస్తోంది.  

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా నరేంద్ర మోదీ స్టేడియానికి పేరుంది. ఒకేసారి లక్ష మంది అభిమానులు మ్యాచ్ వీక్షించవచ్చు. ఎలాగూ ఇండియా, పాక్ మ్యాచ్ అంటే ఓ రేంజ్‌లో డిమాండ్ ఉంటుంది. ఇరు దేశాల అభిమానులతో పాటు విదేశాల నుంచి అభిమానులు ఈ మ్యాచ్ చూడటానికి వస్తారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా ఇండో-పాక్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు

  • అక్టోబర్‌ 8: ఇండియా vs ఆస్ట్రేలియా (చెన్నై)
  • అక్టోబర్‌ 11: ఇండియా vs అఫ్గానిస్థాన్‌ (ఢిల్లీ)
  • అక్టోబర్‌ 15 : ఇండియా vs పాకిస్థాన్‌ (అహ్మదాబాద్‌)
  • అక్టోబర్‌ 19 : ఇండియా vs బంగ్లాదేశ్‌ (పూణే)
  • అక్టోబర్‌ 22: ఇండియా vs న్యూజిలాండ్‌ (ధర్మశాల)
  • అక్టోబర్‌ 29: ఇండియా vs ఇంగ్లాండ్‌ (లక్నో)
  • నవంబర్‌ 2: ఇండియా vs క్వాలిఫయర్‌ జట్టు (ముంబై)
  • నవంబర్‌ 5: ఇండియా vs సౌతాఫ్రికా (కోల్‌కతా)
  • నవంబర్‌ 11: ఇండియా vs క్వాలిఫయర్‌ జట్టు (బెంగళూరు)