తెలుగు యోధాస్‌‌‌‌కు ఒడిశా జాగర్‌‌‌‌‌‌‌‌నాట్స్‌‌‌‌ చెక్

తెలుగు యోధాస్‌‌‌‌కు ఒడిశా జాగర్‌‌‌‌‌‌‌‌నాట్స్‌‌‌‌ చెక్

కటక్‌‌‌‌: అల్టిమేట్‌‌‌‌ ఖో ఖో లీగ్‌‌‌‌లో వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న తెలుగు యోధాస్‌‌‌‌కు ఒడిశా జాగర్‌‌‌‌‌‌‌‌నాట్స్‌‌‌‌ చెక్ పెట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో డిఫెండింగ్ చాంప్‌‌‌‌ ఒడిశా 35–27తో యోధాస్‌‌‌‌ను ఓడించి టేబుల్‌‌‌‌ టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు చేరుకుంది.  

దిలీప్‌‌‌‌, ఓంకార్‌‌‌‌‌‌‌‌, అవనీశ్‌‌‌‌ తలో ఆరు ఎటాక్‌‌‌‌ పాయింట్లతో ఆ టీమ్‌‌‌‌ను గెలిపించారు. మరో మ్యాచ్‌‌‌‌లో ముంబై ఖిలాడీస్‌‌‌‌ 29–27తో రాజస్తాన్‌‌‌‌ వారియర్స్‌‌‌‌ను ఓడించింది. ఇప్పటికే సెమీస్‌‌‌‌ చేరుకున్న యోధాస్ సోమవారం జరిగే చివరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో గుజరాత్‌‌‌‌ జెయింట్స్‌‌‌‌తో పోటీ పడనుంది.