హైటెక్‌సిటీలో కంచి కేఫ్

హైటెక్‌సిటీలో కంచి కేఫ్

హైదరాబాద్, వెలుగు : సంప్రదాయ వంటకాలను అందించే కంచి కేఫ్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హైటెక్ సిటీలో ప్రారంభమైంది. కార్యక్రమానికి  దేవ  ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ స్వామి, నటుడు నాగబాబు హాజరయ్యారు. భారతదేశం  గొప్ప సాంస్కృతిక వారసత్వానికి 'కంచి కేఫ్' నిదర్శనమని అన్నారు.  దీనిని ప్రత్యేకంగా కాంచీపురం ఆలయం వాతావరణాన్ని ప్రతిబింబించేలా అలంకరించారు. 

ఇక్కడ దక్షిణ భారత ఆహారాన్ని వడ్డిస్తామని టీ టైమ్  కంచి కేఫ్  వ్యవస్థాపకుడు ఉదయ్  శ్రీనివాస్  తంగెళ్ల  చెప్పారు.  మెనూ లో చక్కెర పొంగల్, టెంపుల్ పులిగారె, రవ్వ  కిచిడీ, తట్టు ఇడ్లీ, నెయ్యి రాగి దోస  వంటివి ఉంటాయని వివరించారు. భారతదేశం అంతటా 3,800 అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్న చాయ్ -చైన్ 'టీ టైమ్' దీనిని నిర్వహిస్తోంది.