
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ తన ప్రొడక్టులపై పలు ఆఫర్లను ప్రకటించింది. 55- అంగుళాలు, అంతకంటే పెద్ద స్క్రీన్ టీవీలు నియో క్యూఎల్ఈడీ 4కే 8కే, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ క్రిస్టల్ 4కే యూహెచ్డీ టీవీలపై క్యాష్బ్యాక్లను అందిస్తోంది. ఆఫర్లు జనవరి 31వరకు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు రూ. 1,24,999 విలువైన గెలాక్సీ ఎస్23 అల్ట్రా, రూ. 69,990 విలువైన 50-అంగుళాల క్యూఎల్ఈడీ 4కే ది సెరిఫ్ టీవీ, వైర్లెస్ సౌండ్బార్ల వంటి ఉచిత బహుమతులను పొందవచ్చు.