ఇవాళ (మే 30న) పీఎం జన్మన్ స్కీమ్​పై మీటింగ్

ఇవాళ (మే 30న) పీఎం జన్మన్ స్కీమ్​పై మీటింగ్
  • అటెండ్ కానున్న 5 రాష్ట్రాల అధికారులు

హైదరాబాద్, వెలుగు: పీఎం జన్మన్, డీఏజేజీయూఏ (ధర్తి ఆబ జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ )స్కీమ్ లపై శుక్రవారం కీలక మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరగనుంది. తెలంగాణ ట్రైబల్ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న  ఈ మీటింగ్ కు కేంద్ర ట్రైబల్ ఉన్నతాధికారులతో పాటు సౌత్ ఈస్ట్ రాష్ర్టాలైన పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్, ఒడిశా, జార్ఖండ్ , తెలంగాణకు చెందిన ట్రైబల్ శాఖతో పాటు  17 శాఖల ఉన్నతాధికారులు అటెండ్ కానున్నారు.  

మంత్రి సీతక్క, సీఎస్ రామకృష్ణరావులు కూడా అటెండ్ కానున్నారని ట్రైబల్ సెక్రటరీ శరత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ  రెండు స్కీమ్ ల కింద కేంద్రం ఇస్తున్న ఫండ్స్, వివిధ అభివృధ్ది పనులు, వాటి రిపోర్ట్ లను ఈ మీటింగ్ లో చర్చించి, విడుదల చేయనున్నారు.