మహబూబ్​నగర్ జిల్లాలో..జంతు కళేబరాలతో ఆయిల్ తయారీ

మహబూబ్​నగర్ జిల్లాలో..జంతు కళేబరాలతో ఆయిల్  తయారీ
  • ప్రశ్నించిన వారిపై ఫ్యాక్టరీ సిబ్బంది దాడి

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : మహబూబ్​నగర్  రూరల్  మండలం గాజులపేట గ్రామ సమీపంలో కొంతకాలంగా పశువుల ఎముకలు, కళేబరాల నుంచి నూనె తీస్తున్నారు. దీని నుంచి వచ్చే దుర్వాసనతో గాజులపేట గ్రామంలోని చిన్నపిల్లలు, వృద్ధులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనిపై కొంతమంది యువకులు మంగళవారం ఫ్యాక్టరీకి వెళ్లి నిలదీయగా, ఆంజనేయులు, యాదగిరి, నర్సింలుపై ఫ్యాక్టరీ సిబ్బంది కర్రలతో దాడి చేశారు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఫ్యాక్టరీ ముందు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అదే సమయంలో ఎముకలు, కళేబరాలతో ఫ్యాక్టరీకి వస్తున్న వెహికల్​ను గ్రామస్తులు అడ్డుకొని, కళేబరాలను రోడ్డుపై విసిరేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.