కలెక్టర్ సారూ.. రూ.3లక్షల స్కీం ఇప్పించండి

కలెక్టర్ సారూ.. రూ.3లక్షల స్కీం ఇప్పించండి

కూసుమంచి, వెలుగు: ‘స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేవారికి రూ.3లక్షలు ఇస్తామని సర్కార్​చెప్పిందని, నా స్థలంలో చిన్న రేకుల షెడ్​ వేసుకున్న సారూ. రూ.3లక్షల స్కీమ్ ఇప్పించుండ్రీ’.. అంటూ బొంకూరి సైదులు అనే వృద్ధుడు కలెక్టర్​ పీవీ గౌతమ్​ను సోమవారం వేడుకున్నాడు. స్కీం రాగానే ఇప్పిస్తానని కలెక్టర్​ హామీ ఇచ్చారు. మండలంలోని నాయకన్​గూడెం వచ్చిన కలెక్టర్ కు ఉపాధిహామీ కూలీలు తమకు వారానికి కేవలం రూ.200లే పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్​ కూలీలతో మాట్లాడుతూ రోజుకు నాలుగైదు గంటలు పని చేయాలని సూచించారు. గ్రామ సర్పంచ్​కాసాని సైదులు10 ఎకరాలమెగా పార్కులో మొక్కలు నాటామని, మేకలు, పశువులు మేస్తున్నాయని పార్కు చుట్టూ ఫెన్సింగ్​వేయించాలని కలెక్టర్ ను కోరారు. అనంతరం కలెక్టర్​సంపద వనంలో మొక్క నాటి నీరు పోశారు. ఆయన వెంట డీఆర్​డీఏ పీడీ విద్యాచందన, ఎంపీడీవో కరుణాకర్​రెడ్డి, ఏపీవో అప్పారావు 
తదితరులు ఉన్నారు.