127 ఏండ్లు జీవించిన బ్రెజిల్ వాసి
బ్రెజిల్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా భావిస్తున్న బ్రెజిల్కు చెందిన జోస్ పౌలినో గోమ్స్ మృతిచెందాడు. గత శుక్రవారం బ్రెజిల్లోని పెడ్రా బోనిటాలో గల తన ఇంట్లో అతడు కన్నుమూశాడు. 127 ఏండ్ల గోమ్స్.. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పెడ్రా బోనిటాలోని కొరెగో డాస్ ఫియాల్ హోస్ శ్మశానవాటికలో శనివారం అతని అంత్యక్రియలు నిర్వహించారు. మరో వారం రోజుల్లో గోమ్స్కు 128 ఏండ్లు వచ్చేవని ఫ్యామిలీ మెంబర్స్ పేర్కొన్నారు. గోమ్స్ 1895, ఆగస్టు 4న జన్మించాడు. ఆయన రెండు ప్రపంచ యుద్ధాలను చూశాడు. అలాగే, మూడు మహమ్మారుల నుంచి బయటపడ్డాడు.