
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఒలంపిక్ రన్ నిర్వహించారు. జడ్పీ బాయ్స్హైస్కూల్ దగ్గర ప్రారంభమైన ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం వరకు సాగింది. ర్యాలీని ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డీవో వీణ, జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. క్రీడకారులు, పీఈటీలు, విద్యార్థులు రన్లో పాల్గొన్నారు.
క్రీడలపై విద్యార్థులకు ఆసక్తి పెంచేందుకు ఒలంపిక్ రన్ చేపట్టినట్లు ప్రతినిధులు తెలిపారు. డీఈవో రాజు, జిల్లా యూత్, స్పోర్ట్ అధికారి జగన్నాథం, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కన్వీనర్ కరుణాకర్రెడ్డి, కో కన్వీనర్ రంగా వెంకటేశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.