కామారెడ్డిలో ఒలంపిక్ రన్

కామారెడ్డిలో ఒలంపిక్ రన్

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఒలంపిక్ రన్ నిర్వహించారు. జడ్పీ బాయ్స్​హైస్కూల్ దగ్గర ప్రారంభమైన ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం వరకు సాగింది. ర్యాలీని ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డీవో వీణ, జిల్లా లైబ్రరీ చైర్మన్​  మద్ది చంద్రకాంత్​రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. క్రీడకారులు, పీఈటీలు, విద్యార్థులు రన్​లో పాల్గొన్నారు.

 క్రీడలపై విద్యార్థులకు ఆసక్తి పెంచేందుకు ఒలంపిక్​ రన్​ చేపట్టినట్లు ప్రతినిధులు తెలిపారు. డీఈవో రాజు, జిల్లా యూత్, స్పోర్ట్​ అధికారి జగన్నాథం, మున్సిపల్ కమిషనర్ రాజేందర్​రెడ్డి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కన్వీనర్ కరుణాకర్​రెడ్డి, కో కన్వీనర్ రంగా వెంకటేశ్వర్​గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.