న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్లైన్స్ కంపెనీల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. ఒమిక్రాన్ వేరియంట్కేసులు పెరుగుతుండటంతో ప్యాసింజర్లు ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. టికెట్ క్యాన్సిలేషన్లు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ఇది చాలదన్నట్టు.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు చుక్కలు చూస్తున్నాయి. గత ఏడాది జూన్ నుంచి ప్రతి నెలా ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. థర్డ్ వేవ్ మొదలుకాగానే సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో డిసెంబరు క్వార్టర్లో చాలా ఎయిర్లైన్స్ కంపెనీలు నష్టాలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇండియా ఏవియేషన్ మార్కెట్లీడర్ ఇండిగో ఎయిర్లైన్స్కు డిసెంబరు క్వార్టర్లో రూ.200 కోట్ల వరకు నష్టాలు రావొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. ఏటీఎఫ్ధర సీక్వెన్షియల్గా 11 శాతం పెరిగిందని తెలిపింది. ఆర్ఏఎస్కే 16 శాతం పెరుగుతుందని పేర్కొంది. ఒక్కో సీటు నుంచి కిలో మీటరుకు వచ్చే ఆదాయాన్ని ఆర్ఏఎస్కే అంటారు. స్పైస్జెట్ లిమిటెడ్ కూడా డిసెంబర్ క్వార్టర్లో రూ.440 కోట్ల నష్టాన్ని ప్రకటించే అవకాశం ఉందని సెంట్రమ్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ వెల్లడించింది. 2022 ఆర్థిక సంవత్సరం క్యూ3లో, దేశీయ ఏటీఎఫ్ ధరలు 12.1శాతం క్వార్టర్లీ (76 శాతం) పెరిగి రూ78.9లకు చేరాయి. బ్రెంట్ క్రూడ్ ధర క్వార్టర్లీ 8.4 శాతం పెరిగి బ్యారెల్కు 79.4 డాలర్లు పలుకుతోందని ఎయిర్లైన్స్ కంపెనీలు చెబుతున్నాయి.