కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కంటే ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రజలందరూ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తెలంగాణాలో కూడా బయటి దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా హైదరాబాద్ లో బయటి దేశం నుంచి వచ్చిన ఒమిక్రాన్ పేషంట్ కి వైద్యం చేసిన డాక్టర్ కి కూడా ఒమిక్రాన్ సోకింది. అంతేకాకుండా ఆ డాక్టర్ భార్యకు కరోనా నిర్ధారణ అయింది. దాంతో ఆమె శాంపిల్ ను జినోమ్ సీక్వెన్స్ కు పంపించారు. కాగా.. డాక్టర్ పనిచేస్తున్న ఆస్పత్రిలో కాంటాక్ట్స్ అందరినీ క్వారంటైన్ కు తరలించారు.
For More News..
ఎదుటి వాడిని ప్రేమించమడమే మతం
సాయంచేయడానికొచ్చిన పోలీసులనే ఐడీ కార్డు అడిగిన వ్యక్తి