
ఐపీఎల్ 16 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తన విశ్వ రూపాన్ని చూపిస్తున్నాడు. నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 42 పరుగులు చేసిన సంజూ.. ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాజస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డ్ సృష్టించాడు.
ఇప్పటివరకు అజింక్య రహానే పేరిట ఉన్న ఈ రికార్డును సంజూ శాంసన్ అధిగమించాడు. రహానే రాజస్థాన్ తరఫున 3,098 పరుగులు చేయగా.. శాంసన్ నిన్నటి 3,138 రన్స్ చేశాడు. రహానే 106 మ్యాచుల్లో ఈ పరుగులు చేస్తే.. సంజూ 118 మ్యాచుల్లో ఈ ఫీట్ అందుకుని ఆల్ టైం టాప్ స్కోరర్ గా నిలిచాడు. తర్వాతి స్థానాల్లో షేన్ వాట్సన్ 2,474 పరుగులు, జోస్ బట్లర్ 2,378 పరుగులు చేశారు. రాహుల్ ద్రావిడ్ 1,324 పరుగులు చేశాడు.