గుర్తుంచుకోండి.. బెంగాల్‌లో గెలిచేది దీదీనే

గుర్తుంచుకోండి.. బెంగాల్‌లో గెలిచేది దీదీనే

న్యూఢిల్లీ: వెస్ట్ బెంగాల్‌‌లో జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్స్‌‌‌‌‌‌పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్‌‌కు చెందిన ఐ-ప్యాక్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌‌గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌‌గా మారాయి. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న యుద్ధమని చెప్పిన ప్రశాంత్ కిషోర్.. బెంగాల్ తమ సొంత కూతురినే కోరుకుంటోందని, ఇతరులను కాదన్న తృణమూల్ నినాదాన్ని ట్వీట్ చేశారు.

‘ప్రజాస్వామ్యం కోసం చేసే యుద్ధాల్లో ఓ కీలక సమరం పశ్చిమ బెంగాల్‌‌లో జరగబోతోంది. అందుకు బెంగాల్ ప్రజలు రెడీగా ఉన్నారు. సరైన వారిని ఎంచుకునేందుకు, తమ సందేశాన్ని పంపేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారు. బెంగాల్‌ తమ సొంత కూతురిని మాత్రమే కోరుకుంటోంది. మే 2వ తేదీ వరకు ఈ ట్వీట్‌‌ను గుర్తుంచుకోండి’ అంటూ పీకే పేర్కొన్నారు.