స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్ట్ 15 పురష్కరించుకొని కేంద్ర హోంశాఖ బుధవారం గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ సర్వీసులో పని చేసే 1037 మంది అధికారులకు ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అవార్డుల జాబితాను విడుదల చేసింది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ఏటా రెండు సార్లు ఈ పతకాలను ప్రకటిస్తుంది.
గ్యాలంట్రీలో 213 మెడల్స్, పీఎంజీలో 1 మెడల్, 94 మందికి పీఎస్ఎం మెడల్స్ ఇవ్వనున్నారు. ఇక గ్యాలంట్రీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు మెడల్స్, తెలంగాణకు 7 మెడల్స్ దక్కాయి. మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్(MSM) కు729 మందిని ఎంపిక చేశారు. ఎంఎస్ఎం విభాగంలో ఏపీకి 19, తెలంగాణకు 11 మెడల్స్ వచ్చాయి.
