సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ‘జాతీయ ఏక్తా ర్యాలీ’

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ‘జాతీయ ఏక్తా ర్యాలీ’

కూకట్ పల్లి : సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి సందర్భంగా నిజాం పేట్ నుండి వివేకానంద నగర్ వరకూ ‘జాతీయ ఏక్తా ర్యాలీ’ నిర్వహించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. జాతీయ ఏక్తా ర్యాలీకి ముఖ్యఅతిథిగా మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జ్ మురళీధర్ రావు హాజరయ్యారు. ర్యాలీ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసాల పోటీల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మురళీధర్ రావు బహుమతులు అందజేశారు. అనాడు 550కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మురళీధర్ రావు కొనియాడారు.