వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో కీలక మార్పు

వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో కీలక   మార్పు

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేసిన ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌లో ఒక్క మార్పు చోటు చేసుకుంది. స్పిన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో అతని స్థానంలో ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌ను టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నారు. 

ఇటీవల ఆసీస్‌‌‌‌‌‌‌‌తో రెండు వన్డేలు ఆడిన అశ్విన్‌‌‌‌‌‌‌‌ 4 వికెట్లు తీశాడు. ‘ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో అక్షర్‌‌‌‌‌‌‌‌ ఎడమ తొడ కండరానికి గాయమైంది. వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లోగా కోలుకుంటాడని ఆశించాం. కానీ అతని ఇంజ్యురీ ఇంకా తగ్గలేదు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో అక్షర్‌‌‌‌‌‌‌‌ను మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో ఆడిస్తే గాయం తీవ్రత పెరిగే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. అందుకే అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో అశ్విన్‌‌‌‌‌‌‌‌ను తీసుకుంటున్నాం’ అని బీసీసీఐ పేర్కొంది. మరోవైపు టీమిండియా ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కోసం గువాహటికి చేరుకుంది.