జమ్మూ కాశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నౌషారా ప్రాంతంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడంది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. 56 మందికి గాయాలయ్యాయి. బస్సు రాజౌరీ నుంచి నౌషారాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 57మంది ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆర్మీ, పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని నౌషారాలోని సబ్ డిస్ట్రిక్ హాస్పిటల్కు తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రాజౌరీలోని జీఎంసీ హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన ఒకరి మృతదేహాన్ని ఘటనాస్థలం నుంచి పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్కు తరలించారు.
J&K | One dead, 56 injured in a bus accident at Nowshera
— ANI (@ANI) March 28, 2022
The bus was on the Rajouri-Nowshera route. We've received 56 injured patients out of which one person died during treatment. Four critically injured patients are referred to GMC hospital, Jammu: Sukhdev Singh, ADC Nowshera pic.twitter.com/qAgUoR0n8i