ముంబై- హైవేపై అదుపుతప్పిన తుపాన్ వెహికల్..ఒకరు మృతి, 9 మందికి గాయాలు

ముంబై- హైవేపై అదుపుతప్పిన తుపాన్ వెహికల్..ఒకరు మృతి, 9 మందికి గాయాలు

సదాశివపేట, వెలుగు: ముంబై–హైదరాబాద్  హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరో 9 మంది గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట హైవేపై ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్  బోరబండకు చెందిన సుశాంత్  తన స్నేహితులతో కలిసి తుపాన్ వెహికల్​లో హైదరాబాద్  నుంచి బీదర్ కు వెళ్తుండగా, సదాశివపేట శివారులో వెహికల్ అదుపు తప్పి పల్టీ కొట్టింది. 

పక్కనే ఉన్న గుంతలో వాహనం పడిపోవడంతో డ్రైవింగ్  చేస్తున్న సుశాంత్(21) చనిపోయాడు. మిగిలిన 9 మందికి గాయాలు కాగా, సంగారెడ్డి గవర్నమెంట్  హాస్పిటల్ కు తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.