CM క్యాంప్ ఆఫీస్ దగ్గర్లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం

CM క్యాంప్ ఆఫీస్ దగ్గర్లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దారుణం జరిగింది. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర్లో ఓ తల్లి, తండ్రి.. వారి ముగ్గురు బిడ్డలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడున్న పోలీసులు వెంటనే అలర్టయ్యారు. భార్యాభర్తలను, ముగ్గురు పిల్లలను కాపాడారు. వీరిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకెళ్లి వివరాలు సేకరించి .. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఐలేష్, అతడి భార్య కుటుంబానిది హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం. వారికి ఓ కూతురు, ఇద్దరు కొడుకులు. భూదాన్ బోర్డ్ ల్యాండ్ వివాదంలో తమకు కుటుుంబానికి అన్యాయం జరిగిందని.. ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం అందలేదని ఐలేష్ చెప్పారు. తమకు రావాల్సిన నష్టపరిహారం.. తప్పుడు సర్టిఫికెట్లతో వేరేవాళ్లు తీసుకున్నారని.. కోర్టులో కేసులు వేసినా న్యాయం జరగలేదని.. అందుకే అందరికీ తెలిసేలా ఆత్మహత్యాయత్నం చేశామని చెప్పారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.