విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించాలి ... ఏకలవ్య స్కూల్స్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సీతాలక్ష్మి

విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించాలి ... ఏకలవ్య స్కూల్స్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సీతాలక్ష్మి
  • మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో  ఏకలవ్య స్కూల్స్ స్టేట్​ స్పోర్ట్స్​మీట్​ షురూ 

కొత్తగూడ, వెలుగు: విద్యార్థి దశ నుంచే క్రీడల్లో నైపుణ్యం సాధించాలని ఏకలవ్య స్కూల్స్ స్టేట్​ ప్రిన్సిపల్​సెక్రటరీ సీతాలక్ష్మి సూచించారు.  మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్ళపల్లి ఏకలవ్య స్కూల్​లో గురువారం స్టేట్​లెవల్ స్పోర్ట్స్​మీట్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. 

ఏకలవ్య స్కూళ్లలో చదివే స్టూడెంట్లు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. స్టేట్​లెవల్ లో ఎంపికైన స్టూడెంట్లు  జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణకు మంచి పేరు తీసుకొని రావాలన్నారు. ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు.  

స్టూడెంట్ల కెరీర్​ గైడైన్స్​ కోసం కొత్తగా ‘తలాష్’​ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.  స్టేట్​అడిషనల్​సెక్రటరీ పి. మాధవి దేవి, స్పోర్ట్స్​ ఆఫీసర్​ వీరు నాయక్​, ఓఎస్డీ శ్రీనివాస్​,ఆర్సీవో రత్నకుమారి 
పాల్గొన్నారు.