ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఇవాళ ఎంతంటే

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఇవాళ ఎంతంటే
  • ఇవాళ 22 వేల 164 కొత్త కేసులు.. 92 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి వరకు 20వేల కేసులు నమోదు కాగా.. ఇవాళ మరో రెండు వేల కొత్త కేసులు పెరిగి మొత్తం కేసుల సంఖ్య 22 వేల 164గా నమోదైంది. అలాగే కరోనాతో చికిత్స పొందుతున్న వారిలో 18 వేల 832 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయి వెళ్లిపోగా  92 మంది కన్నుమూశారు. 
గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో 1 లక్షా 5 వేల 494 మందికి పరీక్షలు చేయగా వారిలో 22 వేల 164 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే కోవిడ్ వల్ల గుంటూరు జిల్లాలో 12 మంది, విజయనగరం జిల్లాలో 11 మంది, విశాఖపట్టణంలో 10 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 9 మంది, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున, నెల్లూరు జిల్లాలో ఏడుగురు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, చిత్తూరు, కృష్ణ, శ్రీకాకుళం జిల్లాలలో ఐదుగురు చొప్పున కన్నుమూశారు. అలాగే 18 వేల 832 మంది కరోనా నుండి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 1 కోటి 73 లక్షల 67 వేల 935కు చేరిందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.