వాక్సిన్ తీసుకున్న వారికే GHMC లోకి అనుమతి

 వాక్సిన్ తీసుకున్న వారికే GHMC లోకి అనుమతి

తెలంగాణలో కరోనా కేసులు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ కరోనా పై కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే GHMC కార్యాలయాల్లో ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని , ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. ఇదిలా వుండగా ఎల్బీనగర్  జోన్ బల్దియా కార్యాలయం తో పాటు సర్కిల్ కార్యాలయాల ఎదుట కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే లోనికి అనుమతి ..అంటూ ఫెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 15వ తేదీ లోగా బల్దియా ఉద్యోగులు, సిబ్బంది అందరూ వ్యాక్సిన్ చేయించుకోవాలని సూచించారు. కార్యాలయంలో పనుల కోసం వచ్చే పౌరులు కూడా వ్యాక్సిన్ చేయించుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్  లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.