- ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు రిలీజ్
- ఎస్ఎస్సీలో 51.96%,
- ఇంటర్లో 41.02% పాస్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో గతనెలలో జరిగిన టెన్త్, ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. టెన్త్లో 51.96%, ఇంటర్లో 41.02% మంది పాసయ్యారు. గురువారం ఫలితాలను సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి, జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి రిలీజ్ చేశారు. టెన్త్లో 31,720 మంది ఎగ్జామ్ రాయగా, 16,481 మంది పాసయ్యారని, దీంట్లో రెగ్యులర్ 16,047 మంది, సప్లిమెంటరీ 434 మంది ఉన్నారని చెప్పారు. ఇంటర్లో 36,345 మంది రాస్తే, 14,910 మంది ఉత్తీర్ణత సాధించారని, దీంట్లో రెగ్యులర్ అభ్యర్థులు 10,819 మంది, సప్లిమెంటరీ 4,091 మంది ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంటర్లో అత్యధికంగా నాగర్కర్నూల్లో 55.36%, నల్లగొండలో 55.34% మంది పాసయ్యారని, అత్యల్పంగా హైదరాబాద్లో 26.33% మంది ఉత్తీర్ణత సాధించినట్టు వెల్లడించారు. టెన్త్లో అత్యధికంగా నల్లొండలో 87.62%, అత్యల్పంగా జగిత్యాలలో 14.03% మంది పాసైనట్టు చెప్పారు. 26 నుంచి ఆగస్టు 5లోపు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు అవకాశముందని తెలిపారు.