చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీ వంటి ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ను ఇండియా తేవాలన్నా తేలేదు

చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీ వంటి ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ను  ఇండియా తేవాలన్నా తేలేదు
  •  ప్రయత్నించడం వృథా అన్న ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ ఫౌండర్ శామ్‌‌‌‌‌‌‌‌ ఆల్ట్‌‌‌‌‌‌‌‌మాన్‌‌‌‌‌‌‌‌


న్యూఢిల్లీ: చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీ వంటి ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ను డెవలప్‌‌‌‌‌‌‌‌ చేయాలనుకున్నా, ఇండియా చేయలేదని ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ సీఈఓ శామ్‌‌‌‌‌‌‌‌ ఆల్ట్‌‌‌‌‌‌‌‌మాన్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.   ఎకనామిక్ టైమ్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించిన ఓ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ మాదిరి ఇండియన్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు కూడా  ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు ఎలా తేవాలో సలహా ఇవ్వాలని  వెంచర్ క్యాపిటలిస్ట్ రాజన్ ఆనందన్‌‌‌‌‌‌‌‌ ఆల్ట్​మన్​ను అడిగారు. ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐతో పోటీ పడడం అసాధ్యమని ఆయన సమాధానమిచ్చారు. ‘ఫౌండేషనల్ మోడల్స్‌‌‌‌‌‌‌‌లో తమతో పోటీ పడడం వృథా. మీరు ప్రయత్నించొద్దు కూడా. కానీ, ప్రయత్నించాల్సిన బాధ్యత మీకుంది. సక్సెస్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌ చాలా తక్కువని నమ్ముతున్నాను’ అని  పేర్కొన్నారు. దీనికి రాజన్ ఆనందన్ రిప్లై ఇచ్చారు.  ‘క్లియర్ ఆన్సర్ ఇచ్చినందుకు థ్యాంక్యూ శామ్‌‌‌‌‌‌‌‌.  ‘ మీరు చేయలేరు అయినా ప్రయత్నించండి’ అని మీరు చెప్పారు. 5,000 సంవత్సరాల ఇండియన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ తమకు ఏం నేర్పిందంటే  ఇండియన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెనూర్లను తక్కువ అంచనా వేయొద్దని. మేము ప్రయత్నించాలని అనుకుంటున్నాం’ అని ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. మేము ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌ను యాక్సెప్ట్  చేస్తున్నామని టెక్ మహీంద్రా సీఈఓ  గుర్నానీ ట్వీట్ చేశారు.