వైట్బాల్ క్రికెట్లో తన బ్యాట్ పవర్ చూపెట్టిన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. ఇప్పుడు రెడ్బాల్ ఫార్మాట్లోనూ తన ప్రత్యేకతను చూపడానికి కృషి చేస్తున్నాడు..! ఈ నేపథ్యంలో 34 ఏళ్ల రోహిత్కు డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లండ్ సిరీస్ అతిపెద్ద సవాలు కానుంది..! బ్రిటన్ గడ్డపై హిట్మ్యాన్ నిలబడితే.. తన టెస్ట్ కెరీర్ మారుతుంది.! ఒకవేళ ఫెయిలైతే.. మళ్లీ లిమిటెడ్ ఓవర్స్కు పరిమితమయ్యే ప్రమాదం ఉండటంతో రోహిత్ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్.. శర్మకు సుతి మెత్తని వార్నింగ్ ఇస్తున్నాడు..! రెండోవైపు.. రోహిత్కు అండగా నిలిచే క్రమంలో శుభ్మన్ గిల్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న మయాంక్ అగర్వాల్లో మెంటల్ కాన్ఫిడెన్స్ పెరగాలని అతని కోచ్ మురళీ సలహాలు, సూచనలు చేస్తున్నాడు..! కీలక టూర్కు ముందు తమ కోచ్లు ఇచ్చే విలువైన సలహాలను ఈ ఓపెనర్లు పాటిస్తారా? పక్కాగా ప్రిపేర్ అయి ఇంగ్లండ్
గడ్డపై టీమ్ విజయానికి పునాది వేస్తారా?
న్యూఢిల్లీ: అప్పుడెప్పుడో 2014లో బ్రిటన్ గడ్డపై ఫస్ట్ టైమ్ టెస్ట్ మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ.. ఆరో ప్లేస్లో బ్యాటింగ్కు దిగాడు. కానీ పెద్దగా రాణించిన దాఖలాలు మాత్రం లేవు. ఆ తర్వాత ఎక్కువగా వైట్బాల్ ఫార్మాట్పై దృష్టిపెట్టి ఓ రేంజ్కు ఎదిగాడు. కానీ 2019 మళ్లీ టెస్ట్ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అతను ఇప్పుడిప్పుడే ఓపెనర్గా సెటిల్ అవుతున్నాడు. ఇప్పటివరకు ఫర్వాలేదనిపించినా.. ఇంగ్లండ్తో సిరీస్తోనే ఇప్పుడు అసలు కథ మొదలవుతున్నది. ఈ టూర్లో హిట్మ్యాన్ ఏ మేరకు సక్సెస్ అవుతాడన్న దానిపైనే అతని టెస్ట్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది.
ఓపికగా ఆడితేనే..
ఇదే విషయంపై అతని చిన్న నాటి కోచ్ దినేశ్ లాడ్ మాట్లాడుతూ.. రోహిత్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. రోహిత్ తన బ్యాటింగ్పై ఫోకస్ పెంచడంతో పాటు మరింత ఓపికగా ఆడాల్సిన అవసరం ఉందని సూచించాడు. ‘మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలిచే చాన్స్ రోహిత్ తీసుకోవాలి. ఇంగ్లండ్ కండీషన్స్లో ఇది చాలా అవసరం. ఆస్ట్రేలియాలో అతను బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా పడింది. పేసర్లను ఎదుర్కొనే టైమ్లో షాట్ మేకింగ్ సూపర్బ్. ఔట్ అయ్యేలా ఎప్పుడూ కనిపించలేదు. అయినప్పటికీ కొన్ని ఇన్నింగ్స్ల్లో వికెట్లు సులువుగా ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్లో అది జరగకుండా చూసుకుంటే చాలు’ అని లాడ్ విశ్లేషించాడు.
హార్డ్ వర్క్ చాలా ముఖ్యం..
ఇంగ్లండ్లోని సీమింగ్ కండీషన్స్లో రోహిత్ డ్యూక్ బాల్స్ను సమర్థంగా ఎదుర్కొంటే టీమిండియాకు మంచి అవకాశాలుంటాయని లాడ్ చెప్పాడు. ‘ఇండియాలో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో మన బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పడ్డారు. అయినా రోహిత్ చక్కగా నిలబడ్డాడు. ముందుండి టీమ్ను నడిపించాడు. ఇంగ్లండ్లోనూ పునరావృతం చేయాలి. దీనికి అతను చేయాల్సిందల్లా ఫోకస్ పెట్టడమే. ప్రతి బాల్ను దాని మెరిట్ మేరకు ఆడితే చాలు. ఇదే చాలా పెద్ద ప్రభావాన్ని చూపెడుతుంది. అయితే ఇంగ్లండ్లో రోహిత్కు కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. ఇంగ్లండ్ మినహా ఏ ఇతర దేశంలో బాల్ అంతలా స్వింగ్ కాదు. అందుకే మంచి హార్డ్వర్క్తో దానిని హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. అయితే నెట్ సెషన్స్లో క్వాలిటీ బౌలర్లను ఎదుర్కొంటే బాగా వర్కౌట్ అవుతుంది. ఇంగ్లండ్ కండీషన్స్కు అలవాటు పడేందుకు ఇది చాలా దోహదపడుతుంది’ అని కోచ్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో క్వారంటైన్లో ఉన్న 24 మందితో కూడిన టీమిండియా జూన్ 2న సౌతాంప్టన్ బయలుదేరుతుంది. అక్కడ మూడు రోజుల ఐసోలేషన్ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెడుతుంది.
కాన్ఫిడెన్స్ పెరగాలి..
2018లో టెస్ట్ క్రికెట్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మయాంక్ అగర్వాల్.. ఆ తర్వాత చతికిలపడ్డాడు. ఫామ్ కోల్పోవడంతో పాటు పాటు గిల్ రాకతో ఏకంగా టీమ్లో ప్లేస్ కోల్పోయాడు. ఇప్పుడు నాలుగు నెలల ఇంగ్లండ్ టూర్ ఉండటంతో ఏదో ఓ దశలో ఓపెనర్గా మళ్లీ ప్లేస్ దక్కించుకుంటున్నాడని మయాంక్ భావిస్తున్నాడు. అది జరగాలంటే.. ముందుగా మెంటల్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని అతని చిన్ననాటి కోచ్ ఆర్ఎక్స్ మురళీ సూచిస్తున్నాడు. ‘మన ఆట, ఫామ్ మొత్తం మైండ్సెట్పైనే ఆధారపడి ఉంటుంది. మైండ్లో సడెన్గా డౌట్స్ క్రియేట్ అయితే అవి చాలా సమస్యలు తెచ్చిపెడతాయి. దీంతో మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ప్రతి ఒక్కదానిపై డౌట్ పెట్టుకోకుండా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది’ అని మురళీ పేర్కొన్నాడు.
ప్రతి సిరీస్కూ అడ్జెస్ట్మెంట్స్ అవసరం
ప్రతి ఓవర్సీస్ టూర్లో బ్యాట్స్మెన్ తమ గేమ్లో అడ్జెస్ట్మెంట్స్ చేసుకోవాలని మురళీ చెప్పాడు. ‘ఆస్ట్రేలియా వికెట్లపై బౌన్స్ లభిస్తే.. ఇంగ్లండ్ పిచ్లపై స్వింగ్ వస్తుంది. కాబట్టి దీనిపై వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా నిరంతర పక్రియ. కానీ, స్పోర్ట్స్ పర్సన్లో చాలా ఆందోళన ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ కంటే ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉంటా యి. ఫెయిల్యూర్స్పై ఆందోళన ఉన్నప్పుడు.. మన ముందు పెద్ద కాంపిటీషన్ ఉంటుం దని తెలుసుకోవాలి. మనం ఆడకపోతే ప్లేస్ పోతుందని గ్రహించాలి. సింపుల్ లాజిక్. ఒక్కసారి విఫలమైతే.. వచ్చే ఆందోళన క్రమంగా పెరిగి పెద్దదవుతుంది. ఈ ప్రాసెస్లో మనం మానసికంగా వెనకబడిపోతాం. ఆసీస్ సిరీస్ తర్వాత మయాంక్ మానసిక అంశాలపై వర్క్ చేశాడు. కాబట్టే ఐపీఎల్లో బాగా ఆడగలిగాడు. అగర్వాల్లో అన్ని టెక్నిక్స్ ఉన్నాయి. కావాల్సిందల్లా కాన్ఫిడెన్స్ మాత్రమే. ఐపీఎల్ పెర్ఫామెన్స్ కచ్చితంగా అతని కాన్ఫిడెన్స్ లెవెల్ను పెంచుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఐపీఎల్కు ముందు మేం చేసిన వర్క్ ఫలించింది కాబట్టి అది నిరంతరం కొనసాగాలి’ అని మురళీ వ్యాఖ్యానించాడు. బెంగళూరులో లాక్డౌన్ ఉండటం వల్ల తాము ఫిజికల్గా ప్రిపేర్ కాలేకపోయామన్నాడు. ఇది మయాంక్ విషయం ఒక్కటే కాదు.. చాలా మంది క్రికెటర్లది ఇదే పరిస్థితి. ఐపీఎల్ తర్వాత బ్యాట్, బాల్ ముట్టిందేలేదన్నాడు. అందుకే ఇంగ్లండ్ టూర్లో ఆరంభ రోజులు చాలా కీలకమన్నాడు. వీటిని అధిగమిస్తే మయాంక్ కచ్చితంగా పెద్ద పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు.