మనోళ్లు 1200 మంది వచ్చిన్రు

మనోళ్లు 1200 మంది వచ్చిన్రు

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్​లో చిక్కుకున్న1200 మంది భారతీయులను, 18 మంది నేపాల్​పౌరులను ‘ఆపరేషన్​ అజయ్’​ ద్వారా 5 ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయెల్​పై జరిగిన దారుణ టెర్రరిస్ట్​ దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు ప్రపంచం మొత్తం ఏకం కావాలని ఆయన కోరారు.

గాజాలో నలుగురు మనోళ్లు.. 

గాజాలో మనోళ్లు నలుగురు చిక్కుకున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. అయితే వాళ్లను ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చే పరిస్థితి లేదని చెప్పింది. ‘‘ప్రస్తుతం గాజాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మనోళ్లను ఇప్పుడు తరలించడం కష్టం. కానీ అవకాశం వస్తే, వెంటనే వాళ్లను బయటకు తీసుకొస్తాం” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్చీ తెలిపారు. అయితే, వాళ్లందరూ క్షేమంగానే ఉన్నారన్నారు.