భూ తగాదా భార్యభర్తల ప్రాణాలను బలిగొంది. ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదంలో ప్రత్యర్థులు ఇద్దరు దంపతులను హతమార్చిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కిరిడిలో శుక్రవారం చోటుచేసుకుంది. శ్యాంరావు(55)కు తన ముత్తాత పేరిట వంద ఎకరాల భూము ఉంది. సర్వే నం.71, 86లో ఉన్న తొమ్మిది ఎకరాల ఇతని భూమిని అత్త మారుబాయి అల్లుడు తెలంగ్రావు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల శ్యాంరావు ఆ భూమి తనే సాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్యాంరావు, భార్య తారాబాయి(47), పెద్ద కొడుకు విలాస్తో కలిసి భూమిని దున్నేందుకు వెళ్లాడు. అదే సందర్భంలో తెలంగరావు చేను వద్దకు చేరుకొని దంపతులపై దాడి చేసి, గొడ్డలితో దారుణంగా నరికి పారిపోయాడు. జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు భార్యభర్తల మృతదేహాలు తరలించకుండా బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. నిందితుడివెంట యశ్వంత్రావు, జంగుబాయి, బొజ్జిరావు, శారద, గంగారాం ఉన్నారని బాధిత కుటుంబసభ్యుల ఆరోపించారు. వారందనికి అరెస్ట్చేసే వరకు మృతదేహాలను తీసుకెళ్లనివ్వమని బైఠాయించారు. భూవివాదంపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ ఈ హత్యలు జరిగాయన్నారు.
భూతగాదాలో భార్యభర్తల హత్య
- తెలంగాణం
- June 22, 2019
లేటెస్ట్
- IPL 2024: రోహిత్కు వెన్నునొప్పి.. సన్రైజర్స్తో పోరుకు అనుమానమే!
- ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగిన్రు : రేణుకా చౌదరి
- శ్రీశైలం శిఖరేశ్వరం చెక్ పోస్టు దగ్గర ఎలుగుబంటి కలకలం
- నరసరావుపేటలో ఉద్రిక్తత.. ఉద్యోగులను ఎమ్మెల్యే గోపిరెడ్డి బెదిరిస్తున్నాడని ఆరోపణ
- This Week OTT Movies: మూవీ లవర్స్ గెట్ రెడీ.. OTTలో ఈవారం ఏకంగా 16 సినిమాలు
- T20 World Cup 2024: ఆ ఇద్దరితో పోలిస్తే గిల్ అదృష్టవంతుడు: వీరేంద్ర సెహ్వాగ్
- మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ
- సన్నాసులు, దద్దమ్మలంటే ఊరుకోం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- వాళ్లంతా మా కోవర్టులే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- ఢీ అంటే ఢీ .. తెలంగాణ కేంద్రంగా ఢిల్లీ పాలిటిక్స్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- పోతురాజు దినేష్ ఇక లేరు