మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఇవాళ(సోమవారం) కన్నుమూశారు. మంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. 81 ఏళ్ల ఫెర్నాండెజ్ ఈ ఏడాది జులైలో ఇంట్లో యోగా చేస్తుండగా కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడులో రక్తం గడ్డకట్టింది. వెంటనే ఆయన్ను ICUలో చేర్చారు. గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు ఆయనకు సర్జరీ నిర్వహించారు. అప్పటి నుంచి ఆయన మంగళూరులోని  ఆస్పత్రిలోని ICUలో నే ఉన్నారు. ఆయన పరిస్థితి మరింత విషమించడంతో ఇవాళ మృత్యువుతో పోరాటం చేస్తూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య బ్లోసమ్ ఫెర్నాండెజ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు.