ఓయూ,వెలుగు: సీఎం రేవంత్రెడ్డి మరో పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ సమ్మక్క, సారలమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఓయూ జేఏసీ విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర వరంగల్మీదుగా సమ్మక్క గద్దెల వరకు కొనసాగుందని ఓయూ జేఏసీ చైర్మన్ ఒరుగంటి కృష్ణ తెలిపారు.
గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, కేసీఆర్ కుటుంబం ఆస్తులు కూడబెట్టుకుందని ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ దివాళా తీయించారని మండిపడ్డారు. గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తుంటే.. ఆయనపై బీఆర్ఎస్నేతలు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఓయూ విద్యార్థులు సురేష్, లాల్,యాదగిరి, నరసింహ, నగేష్, వంశీ తదితరులు ఉన్నారు .