
కేంద్రంపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు విమర్శలు
హైదరాబాద్: కేంద్ర జలశక్తి మంత్రి మన రాష్ట్రంలో ఉన్న మిషన్ భగీరథ పథకం బాగుందని అభినందించారు… గుర్తించినందుకు వారికి కృతజ్ఞతలు.. గుర్తింపు లతో పాటుగా మాకు మిషన్ భగీరథ నిధులు కూడా ఇవ్వాలి…నవంబర్ 30 లోపు మిషన్ భగీరథ ను పూర్తి చేసే దిశలో పనిచేస్తుంటే కేంద్రం నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ఆఫీస్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మిషన్ భగీరథ ను తీసుకు వస్తామని మోడీ చెప్పారు.. జల శక్తి జీవన్ ప్రారంభించారు మంచి పరిణామమే… మన రాష్ట్రంలో 90 శాతం పనులు పూర్తి అయ్యాయి.. నీతి ఆయోగ్ 20,000 వేల కోట్లు నిధులు ఇవ్వాలని కేంద్రానికి సూచించినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గుజరాత్ లో అమలు చేస్తున్న స్కీమ్ కంటే మన రాష్ట్రంలో స్కీమే బాగుంటుంది.. గుజరాత్, యూపీలలో బోర్ల నీటిని ఫిల్టర్ చేసి ఇస్తుంటే.. మనం ఇక్కడ గోదావరి, కృష్ణా నదుల నీళ్లను ఫిల్టర్ చేసి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. బోర్ల నీళ్ల వల్ల బొక్కలు ఖరాబ్ అవుతాయని ఆయన పేర్కొన్నారు.
జల శక్తి జీవన్ పథకం కింద తెలంగాణకు నిధులు ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు నిధులు ఇచ్చారు. ఏమి పనులు జరగక పోయినా వేరే రాష్ట్రాలకు నిధులిస్తున్నారు.. గుజరాత్ కు 883కోట్లు గుజరాత్ లో ఇచ్చారు.. యూపీ లో 5 శాతం పనులు కాలేదు కానీ 2550 కోట్లు ఇచ్చారు.. ఇదే రీతోలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో పనులు కాకపోయినా వందల కోట్లు ఇచ్చారు.. 90 శాతం పనులు పూర్తి అయిన మన రాష్ట్రానికి మాత్రం కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. కేంద్రం మా మీద వివక్ష చూపిస్తుందని విమర్శించారు. మిషన్ భగీరథ వచ్చిన తరువాత తెలంగాణ లో ఫ్లోరైడ్ లేదని పార్లమెంట్ లోనే చెప్పారు… ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం గా తెలంగాణ ను ప్రకటించారు.. కనీసం మెయింటైన్ చేయడానికైనా 2,000 కోట్లు ఇవ్వమంటే ఇవ్వలేదు.. ఇదెక్కడి పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు.
మా సలహాలు ప్రణాళికలు తీసుకున్నారు.. మా ఇంజనీర్ ల సలహాలు తీసుకున్నారు .. కానీ మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు… దేశంలో ఎక్కువ పన్నులు కడుతున్న రాష్ట్రం తెలంగాణ నే.. గుజరాత్, యూపీ కంటే మేము ఎక్కువ పన్నులు కడుతున్నాం… మా దగ్గర దాదాపు పన్నుల రూపంలో 2 లక్షల కోట్లు తీసుకుని.. మాకు లక్ష 50 వేల కోట్లు కూడా ఇవ్వలేదు.. కరోనా కాలంలో పైసలు లేక ఇబ్బంది అవుతోంది… బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని అడిగి మనకు వచ్చే డబ్బులు తీసుకు రావాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. మిషన్ భగీరథ కు కేసీఆర్ ఇంజనీర్.. కేసీఆర్ మనకు దేవుడితో సమానమన్నారు. పెన్షన్ లు మనం 11 వేల కోట్లు ఇస్తే.. కేంద్రం 200 కోట్లు ఇస్తోంది.. మిషన్ భగీరథ కు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. గుజరాత్, యూపీలకు ఇచ్చినట్టు మాకు కూడా మిషన్ భగీరథ కు నిధులు ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. బీజేపీ వాళ్లు పెన్షన్ డబ్బుల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు… 10 ఏండ్లు మిషన్ భగీరథను కాంట్రాక్టర్లు మెయింటైన్ చేస్తారని ఆయన వివరించారు.