
- మంచిర్యాలలో 5,804, ఆదిలాబాద్ 5,816 మంది, ఆసిఫాబాద్లో 2,928, నిర్మల్లో 2534 మంది జాయినింగ్
- ముగిసిన బడిబాటఈ నెలాఖరు వరకు అడ్మిషన్లు
మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లను పెంచడం, డ్రాప్ అవుట్స్ను తిరిగి స్కూళ్లలో చేర్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6న ప్రారంభమైన ప్రోగ్రాం 19 వరకు కొనసాగింది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వివిధ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. టీచర్లు ఇంటింటికి తిరుగుతూ బడీడు చిన్నారులు, డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి ఆయా స్కూళ్లలో చేర్పించారు.
ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి దగ్గరలో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించారు. ఈ నెల 12న స్కూళ్ల రీ ఓపెనింగ్ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించారు. అదేరోజు స్టూడెంట్లకు టెక్ట్స్ బుక్స్, నోట్బుక్స్, యూనిఫామ్స్ అందజేశారు. సామూహిక అక్షరాభ్యాసం, బాలసభలు, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్(లిప్) దినోత్సవం, సమీకృత విద్య, బాలిక విద్యా దినోత్సవం నిర్వహించడంతో పాటు స్కూళ్లలో డిజిటలైజేషన్, ఇతర ఆధునిక సౌకర్యాల గురించి వివరిస్తూ పిల్లలను, తల్లిదండ్రులను ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యారు.
పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బడిబాటలో పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు జరిగాయి. మంచిర్యాల జిల్లాలో ఫస్ట్ క్లాస్లో 2,493 మంది పిల్లలను చేర్పించారు. సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు 3,311 మంది విద్యార్థులను చేర్పించారు. ఇందులో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో 1802 మంది చేరగా, ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో 1,509 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. జిల్లాలో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు మొత్తంగా 5,804 స్టూడెంట్లు బడిబాట పట్టారు.
ఆసిఫాబాద్ జిల్లాలో ఫస్ట్ క్లాస్లో 2,079 మంది, సెకండ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు 849 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్లలో చేరారు. ఇందులో ప్రైవేట్ నుంచి 324 మంది స్టూడెంట్లు గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్లు తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ క్లాస్లో 3011 మంది పిల్లలు, 2 నుంచి 10 వరకు 2490మంది పిల్లలు చేరారు. 315 మంది ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ స్కూళ్లకు వచ్చారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 2534 మంది గవర్నమెంట్ బడుల్లో చేరారు. బడిబాట ముగిసినప్పటికీ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఆధునిక వసతులు, నాణ్యమైన విద్య
గత ప్రభుత్వం సర్కారు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో గవర్నమెంట్ స్కూళ్లంటేనే విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం పోయింది. దీనికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్కూళ్లను బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. అమ్మ ఆదర్మ పాఠశాల కమిటీల ద్వారా స్కూళ్లలో టాయ్లెట్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్, కిచెన్ షెడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలు చేపట్టింది. డ్రింకింగ్ వాటర్, కరెంట్ సౌకర్యాలు కల్పించింది.
దీంతోపాటు దశలవారీగా పలు స్కూళ్లలో ఏఐ లెర్నింగ్ను ప్రారంభించింది. రాష్ట్రంలో కొత్తగా 10 వేలకుపైగా టీచర్లను నియమించి ఖాళీ పోస్టులను భర్తీ చేసింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పలు సమస్యలను పరిష్కరించింది. టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు ట్రాన్స్ఫర్లు చేపట్టడంతో అందరూ ఉత్సాహంగా పనిచేసే వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా స్కూళ్ల ఓపెనింగ్ రోజే స్టూడెంట్లకు బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వడం, మిడ్ డే మీల్స్ క్వాలిటీ పెంపు వంటి చర్యలు సర్కారు స్కూళ్లపై ప్రజలు కోల్పోయిన నమ్మకాన్ని నిలబెట్టాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
బడిబాటలో చేపట్టిన అడ్మిషన్ల వివరాలు
జిల్లా ఫస్ట్ క్లాస్ 2 నుంచి 10 మొత్తం
మంచిర్యాల 2493 3211 5804
ఆసిఫాబాద్ 2079 849 2928
ఆదిలాబాద్ 3011 2490 5816