మాస్క్ లేకుండా బయటికి వచ్చిన 3,954 మంది అరెస్టు

మాస్క్ లేకుండా బయటికి వచ్చిన 3,954 మంది అరెస్టు

న్యూఢిల్లీ: మాస్క్ లేకుండా ఇండ్లలోంచి బయటికి వచ్చిన 3,954 మందిని అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. గురువారం 190, శుక్రవారం 32 కేసులు ఫైల్ చేసినట్లు తెలిపారు. మాస్క్ లేకుండా బయటికి వచ్చినవారిపై యాక్షన్ తీసుకోవాలని ఢిల్లీలో ఇప్పటికే ఆదేశాలు అమల్లో ఉన్నాయి. వైరస్ ఎఫెక్టు నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ వాడాలని, ఇండ్లలోంచి బయటికి రావొద్దని ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఆ ఆదేశాలు పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు బయటికి వస్తున్నారని.. ఢిల్లీ, ముంబై సిటీలతో పాటు, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలు రూల్స్ ను మరింత కట్టుదిట్టం చేశాయి. మాస్కులు లేకుండా బయటికి వస్తే ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించినట్లేనని, ఐపీసీ 188 సెక్షన్ కింద జైల్లో పెడతామంటూ ఆర్డర్స్ జారీ చేశాయి. ఈ మేరకు ఆదేశాలు పాటించకుండా బయటికి వచ్చిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.