
రామనాథపురం: నేవల్ ఏయిర్ స్టేషన్కు చెందిన ఐఎన్ఎస్ పరుందులో పని చేస్తున్న దాదాపు 30 మంది ఆఫీసర్స్కు కరోనా పాజిటివ్గా తేలిందని డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ మంగళవారం తెలిపారు. కానీ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ను ఆపరేషనల్గా ఉంచారని చెన్నైలోని డిఫెన్స్ వర్గాలు చెప్పిన సమాచారన్ని బట్టి తెలుస్తోంది. ఇన్ఫెక్షన్ బారిన పడిన మృతి చెందిన వారి సంఖ్య 33 అని డిస్ట్రిక్ట్ ఆథారిటీస్ తెలుపగా.. వారిలో కొందరు సెయిలర్స్తోపాటు కొత్తగా పోస్టింగ్ అయిన వాళ్లు ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. ప్రొటోకాల్ ప్రకారం కొందరు అధికారులను క్వారంటైన్లో ఉంచారని, వారిలో కొందరికి పాజిటివ్గా వచ్చిందని తెలిసింది. ఐఎన్ఎస్ పరుందులో పని చేసే సివిలియన్ స్టాఫ్ ఎంట్రీని నిషేధించాలమని ఆయా వర్గాలు తెలిపాయి. నేవీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. పాల్క్ బే ఏరియాలో రెగ్యులర్గా రెస్క్యూ కవరేజీ చేయడంతోపాటు సెర్చ్ ఆపరేషన్స్ చేయడానికి ఐఎన్ఎస్ పరుందుకు సాయడపతుంది. దీంతోపాటు కోస్టల్ లేదా ఏరియా సర్వైలెన్స్, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ను ఒకే చోటకు చేర్చడం కూడా పరుందు చేసే ఆపరేషన్ టాస్క్స్గా చెప్పొచ్చు.