దేశంలో కొత్తగా 6,594 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 6,594 కరోనా కేసులు

దేశంలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచీ 8వేలకు పైగా నమోదవుతున్న కరోనా కేసులు నేడు కాస్త తగ్గాయి. కొత్తగా 6,594 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్థరణ అయినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక రోజూ వారి కరోనా పాజిటివిటీ రేటు 2.05శాతంగా రికార్డయింది. కాగా క్రియాశీలక కేసుల సంఖ్య 50,548కు చేరింది. ఈ నేపథ్యంలో కేసుల పెరుగుదల, కరోనా నాలుగో వేవ్ పై అంతటా ఆందోళన నెలకొంది. అయితే అందరూ మళ్లీ కరోనా నిబంధనలు తప్పక పాటించాలని, టెస్టుల సంఖ్యనూ పెంచాలని ఇప్పటికే కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది.