నిరుద్యోగులను మోసం చేస్తున్రు : పి రాజు

నిరుద్యోగులను మోసం చేస్తున్రు : పి రాజు

మరికల్, వెలుగు: నిరుద్యోగులను బీఆర్ఎస్​ ప్రభుత్వం మోసం చేస్తోందని బీసీ ఐక్యవేదిక ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా అధ్యక్షుడు పి రాజు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన బీసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎస్సీపీఎస్సీని రద్దు చేసి కొత్త కమిషన్​ నియమించి నోటిఫికేషన్​ విడుదల చేయాలన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఎమ్మెల్సీల గురించి మాట్లాడడం సరైంది కాదన్నారు. 

కేంద్రం తీసుకొచ్చిన మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు ఎన్ని సీట్లు కేటాయించారని ప్రశ్నించారు. ప్రతీ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో ఇద్దరు బీసీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్,​ ఇపుడు మాట మార్చి బీఆర్ఎస్​ కన్నా ఎక్కువ సీట్లు ఇస్తామనడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో 40 ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలన్నారు. లింగంగౌడ్, బజారప్ప, కురుమన్న పాల్గొన్నారు.