
- నిర్మల్ జిల్లా గోసంపల్లెలో ఘటన
ఖానాపూర్, వెలుగు: బైక్ పై వెళ్తుండగా పీఏసీఎస్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత దంపతులపై దాడికి పాల్పడిన ఘటన నిర్మల్జిల్లాలో జరిగింది. ఖానాపూర్ మండలం సత్తనపల్లి పీఏసీఎస్ చైర్మన్ అమంద శ్రీనివాస్, స్వప్న దంపతులు ఆదివారం సాయంత్రం అదే మండలంలోని గోసంపల్లె గ్రామానికి బైక్ పై వెళ్తున్నారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద ఓ వ్యక్తి అడ్డుగా వచ్చి కర్రలో దాడి చేయడంతో దంపతుల చేతులకు స్వల్ప గాయాలయ్యాయి.
వెంటనే స్థానికులు వీరిని ఖానాపూర్ లోని ఆస్పత్రికి తరలించారు. పాత కక్షతోనే పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, స్వప్న దంపతులపై దాడి జరిగినట్లు తెలిసింది. ఘటనపై ఖానాపూర్ ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ ను ఫోన్ లో సంప్రదించగా గోసంపల్లెలో జరిగిన దాడిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తామని చెప్పారు.