బండి, ఈటల కలిసే పేపర్ లీక్ చేశారు.. అధికారం కోసమే కుట్రలు : పాడి కౌశిక్ రెడ్డి

బండి, ఈటల కలిసే పేపర్ లీక్ చేశారు.. అధికారం కోసమే కుట్రలు : పాడి కౌశిక్ రెడ్డి

కరీంనగర్ జిల్లా:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కలిసే టెన్త్ క్లాస్  పేపర్ లీక్ చేశారని ఎమ్మెల్సీ  పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. టెన్త్ క్లాస్ పేపర్ లీక్ ఘటనపై ఇవాళ హుజురాబాద్ లో  ప్రెస్ మీట్ నిర్వహించిన కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. హిందో క్వశ్చన్ పేపర్ లీక్ కు.. బండి సంజయ్, ఈటల రాజేందర్ కి సంబంధం ఉందని వీళ్ల కనుసన్నల్లోనే పేపర్ లీక్ జరిగిందని కౌశిక్ రెడ్డి విమర్శించారు.

బండి సంజయ్ బాధ్యత గల పదవిలో ఉండి.. పేపర్ లీక్ లు చేస్తూ పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను చట్టం కఠినంగా శిక్షించాలని కోర్టును కోరారు. అధికారంలోకి రావడానికే బండి సంజయ్, ఈటల కలిసి ఇలాంటి కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పేపర్ లీక్ వ్యవహారంలో ఈటలను కూడా అరెస్ట్ చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈటల పిఏ నరేందర్ కి పేపర్ లీక్ లో ఇన్వాల్వ్మెంట్  ఉందని, మహేష్ ఈటల అనుచరుడని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.